అమరావతి,అభివృద్ధిపై దిమ్మ తిరిగే ప్రశ్నలు.. జవాబు చెప్పలేక వైకాపా నేతల ఉక్కిరిబిక్కిరి
రాజధాని అమరావతి విధ్వంసంతో జరిగిన నష్టం, గత అయిదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం, అభివృద్ధి లేక ఉపాధి కరవై యువత వలస పోవడంపై ప్రజల నుంచి తూటాల్లా వస్తున్న ప్రశ్నలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.