IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఆట పూర్తయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు...
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఆట పూర్తయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు. 338/7 ఓవర్నైట్ స్కోర్తో శనివారం రెండోరోజు మహ్మద్ షమి(0)తో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 80వ ఓవర్ చివరి బంతికి షమి షాట్పిచ్ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్ఇండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కాసేపటికే జడ్డూ సైతం అండర్సన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 375/9గా నమోదైంది.
తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో (4, 5 వైడ్లు, 6 నోబాల్, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అండర్సన్ వేసిన మరుసటి ఓవర్ ఐదో బంతికి సిరాజ్ (2) ఔటవ్వడంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో చివరికి భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలిరోజు టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6), జడేజా ఆరో వికెట్కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇలా టీమ్ఇండియా టెస్టుల్లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి.
ఇది వరకు..
* 2013లో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్తో ఆడిన సందర్భంగా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా చివరికి 453 పరుగులు చేసింది.
* అంతకుముందు 1983లో చెన్నై వేదికగా వెస్టిండీస్ జట్టుతోనే తలపడిన సందర్భంగా 92 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు చివరికి 451 పరుగులు చేసింది.
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు..
* బుమ్రా 29 పరుగులు.. ఎక్స్ట్రా 6 పరుగులు (మొత్తం 35 రన్స్) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఇదే మ్యాచ్లో.
* బ్రియాన్ లారా 28 పరుగులు.. 2003లో జోహెనస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్ పీటర్సన్ బౌలింగ్లో.
* బెయిలీ 28 పరుగులు.. 2013లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో.
* కేశవ్ మహారాజ్ 28 పరుగులు.. 2020లో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన మ్యాచ్లో జోరూట్ బౌలింగ్లో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.