Punjab polls: పంజాబ్ ప్రజల ప్రియనేస్తం చన్నీ: సిద్ధూ
చరణ్జిత్ చన్నీని పంజాబ్ ప్రియనేస్తంగా అభివర్ణించారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ. అందరూ ఆయనను ఆదరించాలని కోరారు......
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎవరనే ప్రతిష్టంభనకు తెరదించుతూ అధిష్ఠానం ఆదివారం అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత సీఎం చరణ్జిత్ చన్నీనే సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎలాంటి ప్రయోగాలకూ పోకుండా పోటీలో ఉన్న నవజ్యోత్సింగ్ సిద్ధూని పక్కనపెడుతూ.. చన్నీ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. అయితే సీఎం అభ్యర్థిగా చన్నీని రాహుల్ ప్రకటించగానే.. సిద్ధూ చిరునవ్వులు చిందిస్తూ చన్నీ చేతిని పైకెత్తి చూపడం విశేషం.
అంతకుముందు సిద్ధూ మాట్లాడుతూ.. చరణ్జిత్ చన్నీని పంజాబ్ ప్రియ నేస్తంగా అభివర్ణించారు. అందరూ ఆదరించాలని కోరారు. అయితే తాను ఏ పదవి కోసం ఆరాటపడలేదని, రాష్ట్ర ప్రజల జీవితాలు మెరుగుపడాలని మాత్రమే కృషిచేశానని ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. ‘నా 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవి కోసం తలవంచలేదు. కానీ పంజాబ్ ప్రజల జీవితాలు బాగుపడాలని తపించా’ అని పేర్కొన్నారు.
ప్రస్తుత అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో.. కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి సీఎం చన్నీ, సిద్ధూ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలను తొలగిస్తూ.. అధిష్ఠానం వీరికి సర్దిచెప్పినట్లు తెలుస్తోది. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. చన్నీని అభ్యర్థిగా ఎంచుకుంది. అయితే సిద్ధూని పక్కనపెట్టడంతో పార్టీలో అంతర్గత తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..