Puri Musings: ప్రేమలో పడతాం.. ఐ లవ్ యూ చెబుతాం.. కానీ అదిప్రేమ కాదు: పూరీ జగన్నాథ్
ప్రేమ అనేది నిజమైన ఫీలింగ్ కాదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. మనలో పుట్టే ప్రతి అనుభూతికి శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్సే కారణమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ‘పూరీ మ్యూజింగ్స్’.....
హైదరాబాద్: ప్రేమ అనేది నిజమైన ఫీలింగ్ కాదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. మనలో పుట్టే ప్రతి అనుభూతికి శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్సే కారణమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా ‘కెమికల్ రియాక్షన్స్’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఎలాంటి ఫీలింగ్ వచ్చినా సరే దేవుడ్ని మొక్కుతుంటామని.. ఇకపై అలా చేయవద్దని ఆయన అన్నారు.
‘‘సడెన్గా ఓ రోజు ప్రేమలో పడతాం. ప్రేమించడం మొదలుపెడతాం. ఐ లవ్ యూ చెబుతాం. విరహగీతాలు రాస్తాం. ఇంట్లో వాళ్లు అడ్డుపడతారు. చేతులు కోసుకుంటాం. గోడ దూకుతాం. ఇంట్లో నుంచి పారిపోతాం. చేసేది లేక అక్షింతలు వేసి అందరూ వెళ్లిపోతారు. మీ ఇద్దరూ మిగిలిపోతారు. అది క్లైమాక్స్ అనుకుంటాం. కాదు అది సీన్ నంబర్ వన్. ఆ తర్వాత మీ ఇద్దరి సరదా తీరిపోతుంది. మనలో పుట్టే ప్రేమ అనే ఫీలింగ్ నిజం కాదు. మన శరీరంలో జరిగే ఓ కెమికల్ రియాక్షన్. దానివల్ల మనలో యుఫోరియా కలుగుతుంది. దాన్నే మనం పవిత్రమైన ప్రేమ అనుకుంటాం. మనలో పుట్టే ప్రతి అనుభూతి కూడా కెమికల్స్, హార్మోన్ల వల్ల పుట్టినవే. ప్రేమ ఒక్కటే కాదు మనలో కలిగే ఎన్నో అనుభూతులకు కెమికల్ రియాక్షన్సే కారణం. మన మెదడు రిలీజ్ చేసే హార్మోన్ల వల్లే ఇవన్నీ కలుగుతాయి.’’
‘‘మన మెదడు సిరిటోరియన్ విడుదల చేస్తుంది. అది మనం నిద్రపోవడానికి, లేదా కుంగుబాటుకు కారణం అవుతుంది. అలాగే డోపమైన్. దీన్ని ప్రెజర్ కెమికల్ అని పిలుస్తారు. ఇక, మనలో పుట్టే ప్రేమ.. లైంగిక ఆకర్షణ కారణంగా పుట్టిందే. అసలిక్కడ గొడవెంటంటే.. మనకి ఏ ఫీలింగ్ వచ్చినా వెంటనే దేవుడికి మొక్కేస్తాం. ఒకవేళ సంతోషం వస్తే.. జీవితాంతం ఈ ఇలాగే ఉండాలి అని కోరుకుంటాం. బాధ వస్తే ఈ కష్టాలు వద్దు స్వామీ అంటాం. భయం వేస్తే ‘‘శ్రీ అంజనేయం..’’ అంటాం. ఏ ఫీలింగ్ వచ్చినా దేవుణ్ణి పిలిచేయడమేనా? మనలో కలిగే ప్రతీ ఫీలింగ్ ‘మాయ’ అని దేవుడికి తెలుసు కాబట్టే మన కోరికల్ని ఆయన సీరియస్గా తీసుకోడు. అందుకే ఊరికూరికే మొక్కకండి. ప్రతీ కెమికల్ రియాక్షన్కి వరాలు ఇచ్చుకుంటూ పోవడానికి ఆయన పిచ్చోడు కాదు.. దేవుడు’’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్