తీరు మారకుంటే రాబోయేది మహమ్మారుల శకమే!
అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది.....
తప్పించుకునేందుకు ఉన్న మార్గాలివే..
ఇంటర్నెట్ డెస్క్: అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. ప్రకృతి విధ్వంసానికి.. మహమ్మారుల ఆవిర్భావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే మహమ్మారుల శకాన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలనూ సూచించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టం సర్వీసెస్’(ఐపీబీఈఎస్) అత్యవసర వర్క్షాప్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది నిపుణుల లోతైన విశ్లేషణల అనంతరం ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ దేశాల విధానం ‘ప్రతిచర్య నుంచి నివారణ’ దిశగా మారాలని సూచించింది.
మరో 85వేల వైరస్లు..
నివేదిక ప్రకారం.. భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారులు మరింత తరచుగా, వేగంగా వ్యాప్తి చెందుతాయి. కొవిడ్-19 కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉంది. అంటువ్యాధుల్ని అరికట్టే అంశంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. 1918 నాటి గ్రేట్ ఇన్ప్లూయెంజా తర్వాత వచ్చిన మహమ్మారుల్లో కొవిడ్-19 ఆరోది. అన్ని మహమ్మారుల్లాగే కరోనా మూలమూ జంతువుల్లో తిష్ట వేసే సూక్ష్మజీవుల్లోనే ఉంది. కానీ, మానవ కార్యకలాపాల వల్లే ఇది విజృంభించింది. క్షీరదాలు, పక్షుల్లో ఇప్పటి వరకు గుర్తించని మరో 1.7 మిలియన్ల వైరస్లు ఉన్నాయి. వీటిలో కనీసం 85 వేల వైరస్లు మానవులకు సోకే సామర్థ్యం ఉంది.
ఇవే మహమ్మారుల విజృంభణకు బాటలు..
కాలం గడుస్తున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త మహమ్మారుల పుట్టుక వెనుక పెద్ద రహస్యమేమీ లేదని ఐపీబీఈఎస్ ఛైర్మన్ డాక్టర్ పీటర్ డాస్జక్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలే మహమ్మారుల విజృంభణకూ ఆజ్యం పోస్తున్నాయన్నారు. భూ వినియోగం, వ్యవసాయ విస్తరణ, అస్థిర వాణిజ్య విధానం, ఉత్పత్తి-వినియోగం మధ్య భారీ వ్యత్యాసం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోందని తెలిపారు. దీంతో వన్యప్రాణులు, పశుసంపద, వ్యాధికారకాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. ఇదే మహమ్మారుల విజృంభణకు బాటలు వేస్తోందన్నారు. ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలను అరికట్టడమే మహమ్మారుల శకాన్ని అంతం చేయడానికున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
నియంత్రణ కంటే నివారణకు 100 రెట్లు తక్కువ వ్యయం..
అంటువ్యాధులు ప్రబలిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి రాకుండా అరికట్టడమే మేలని నివేదిక గుర్తుచేసింది. వ్యాక్సిన్లు, ఔషధాల ఆవిష్కరణ కచ్చితమైన పరిష్కారం కాదని.. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు ప్రాణనష్టం భారీ స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడింది. జులై నాటికి కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8-16 ట్రిలియన్ డాలర్లు కోల్పోయిందని అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2021 నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ఒక్క అమెరికాలోనే 16 ట్రిలియన్ డాలర్ల నష్టానికి కారణమయ్యే అవకాశం ఉందంది. మహమ్మారులు వచ్చిన తర్వాత నియంత్రించడానికయ్యే ఖర్చు కంటే రాకుండా నివారించడానికి 100 రెట్లు తక్కువ వ్యయం అవుతుందని తెలిపింది.
నివేదిక సూచించిన విధానపరమైన పరిష్కారాలు..
* రాబోయే మహమ్మారుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వాటి నివారణకున్న మార్గాలను విధానకర్తలకు సూచించేలా ఓ ఇంటర్ గవర్నమెంటల్ మండలిని ఏర్పాటు చేయాలి. ముప్పు ఉన్న ప్రాంతాల్ని గుర్తించి.. విజృంభణ వల్ల తలెత్తే ప్రతికూల పరిణామాల్ని అంచనా వేయాలి.
* ప్రజలు, జంతువులు, ప్రకృతికి లబ్ధి చేకూర్చేలా దేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
* మెరుగైన ఆరోగ్య వ్యవస్థను సాధించేందుకు డబ్ల్యూహెచ్వో రూపొందించిన ‘వన్ హెల్త్’ విధానాన్ని వ్యవస్థీకృతం చేయాలి. తద్వారా మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి.
* అభివృద్ధి, భూ వినియోగ ప్రాజెక్టులలో మహమ్మారుల విజృంభణ, దాని ప్రభావాన్ని అంచనా వేసే వ్యవస్థను రూపొందించాలి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల జీవవైవిద్యానికి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టి వాటి నివారణకు కావాల్సిన పరిష్కారాలను గుర్తించాలి.
* అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారం ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించాలి. మహమ్మారుల విజృంభణకు కారణమవుతున్న జీవులతో వ్యాపారాన్ని నివారించాలి.
* ప్రజల్లో అవగాహన పెంచి అంటువ్యాధుల నివారణ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్