Burger Eat challenge: 20వేల కేలరీల బర్గర్.. 4 నిమిషాల్లో తినేశాడు! వీడియో చూడండి!
తక్కువ సమయంలో స్పీడ్గా ఆహారాన్ని తినాలనే ఛాలెంజ్ల గురించి మనందరికీ తెలుసు
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ సమయంలో స్పీడ్గా ఆహారాన్ని తినాలనే ఛాలెంజ్ల గురించి మనందరికీ తెలుసు. ఈ ఛాలెంజ్లను స్వీకరించి కొందరు ప్రపంచరికార్డులు కూడా బద్దలు కొడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి అందరినీ అలరిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి యూట్యూబ్లో చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి బర్గర్ మీద ఉన్న అతి ఇష్టంతో 20వేల కేలరీల భారీ బర్గర్ను 4 నిమిషాల్లో లాగించేశాడు. ఈ బర్గర్ బరువు 2.94 కిలోలు ఉంటుందట. దీన్ని 40 బేకన్ ముక్కలు, 8.5 పట్టీలు, 16 చీజ్ ముక్కలు, ఉల్లిపాయ, రెండు టమోటాలు, మిర్చి, బన్స్తో తయారు చేశారని చెబుతున్నారు.
మాట్ స్టోనీ అనే వ్యక్తి లాస్ వేగాస్లోని హార్ట్ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్ నిర్వహించిన ఆక్టపల్ బైపాస్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా భారీ బర్గర్ను రికార్డు సమయంలో 4:10 నిమిషాల్లో పూర్తిగా తినేశాడు. ఈ ఛాలెంజ్ వీడియోను 14.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తన యూట్యూబ్ ఛానెల్లో కొద్ది రోజుల క్రితం అప్లోడ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 78 లక్షల మంది వీక్షించారు. అలాగే 39 లక్షలకు పైగా లైక్లు, వేలల్లో కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మికి సుడో అనే వ్యక్తి పేరిట 7:42 నిమిషాల్లో ఉన్న రికార్డును ఇతడు చెరిపేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM