అటవీ సంపద జోలికొస్తే సహించేది లేదు
వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను
ఎస్పీ సీహెచ్ విజయరావు l 55 మంది కూలీలు, ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయరావు.. చిత్రంలో ఏఎస్పీ వెంకటరత్నం, గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి తదితరులు
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఆదివారం చెముడుగుంటలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్పీ వెల్లడించారు. మొత్తం 45ఎర్రచందన దుంగలు, 31 సెల్ఫోన్లు, రెండు వాహనాలు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2రంపాలు, రూ.75,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఎస్పీ వెల్లడించారు. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన ఒల్లూరు దాము గతంలో ఆయిల్ ట్యాంకర్లు నడిపి నష్టం రావడంతో కుప్పన్న సుబ్రహ్మణ్యం వద్ద లారీ క్లీనర్గా పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అయిదు నెలల క్రితం దాముకు పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వెలుమలైతో పరిచయమైంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ క్రమంలో ఈ నెల 20న వీరు ముగ్గురితోపాటు పుదుచ్చేరికి చెందిన రాధాకృష్ణన్ పళని కొంతమంది కూలీలను తీసుకుని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దొరికే ఎర్రచందనం దుంగలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూలీలను ఐషర్ వాహనంలో తీసుకురాగా, ప్రధాన నిందితులు ముగ్గురు ఒక కారులో బయల్దేరి చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ని తీసుకుని గూడూరు నుంచి రాపూరు అడవుల్లోకి వెళ్లారు. 21న సాయంత్రం దుంగలతోపాటు వాహనాల్లో చెన్నై వైపు తరలిస్తుండగా చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అయితే, కూలీలు పోలీసులపై తిరగబడగా, అతి కష్టమ్మీద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినా మాకు తెలియజేయాలనీ, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎర్రచందన అక్రమార్కులను పట్టుబడటంలో ప్రతిభ కనబరిచిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, గ్రామీణ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట రత్నం, శ్రీనివాసరావు, ఎస్డీ డీఎస్పీ కోటారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్విచక్ర వాహనాలు దగ్ధం
[ 18-04-2024]
కావలి పట్టణంలో నారాయణ స్కూల్ ఎదురుగా నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి. -
చెక్పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
[ 18-04-2024]
జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్ నైట్ బీట్, చెక్పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా బీవీ నగర్ పరిధిలోని నైట్బీట్లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. -
వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన కీలక నేతలు
[ 18-04-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. -
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం