భవిష్యత్తుతో ఆటలు
జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి.
మళ్లీ మూతపడిన రాష్ట్ర క్రీడా పాఠశాల
మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు
విజయనగరం క్రీడలు, న్యూస్టుడే: జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి. సిబ్బంది లేకుండా నడపలేమని, పర్యవేక్షణ కష్టతరమవుతోందని జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. ఈక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితి ఇదీ..
క్రీడల్లో రాణించే ప్రతిభావంతులైన పిల్లలకు విద్యతో పాటు వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విజ్జీ మైదానంలో సుమారు రూ.20 కోట్లతో క్రీడా పాఠశాలను ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి విడతగా పది శాతం నిధులు మంజూరయ్యాయి. ఇంతలో కొందరు చేరగా, వారికి ఇబ్బంది లేకుండా విజ్జీ ప్రాంగణంలోనే ఒక తాత్కాలిక భవనాన్ని తీసుకొని తరగతులు సైతం ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తరగతులు మాత్రం కొనసాగేవి. ఈక్రమంలో కరోనా రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపేశారు. ఇటీవల రాజీవ్ మైదానం వేదికగా మళ్లీ ప్రారంభించారు. నిధులు లేవని మళ్లీ ఆపేశారు.
తొలగింపు: విద్యాశాఖ ద్వారా ఇద్దరు ఉపాధ్యాయులను, క్రీడాశాఖ ద్వారా పలువురు శిక్షకులను తీసుకున్నారు. 2018లో పాఠశాల నిర్వహణ నిమిత్తం 11 మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. తాజాగా జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ లేదని ఈ 11 మందిలో ఏడుగురిని తొలగించారు.
ఇబ్బంది లేదు..
ప్రస్తుతానికి సెలవులు ఇచ్చాం. త్వరలోనే ప్రారంభిస్తాం. జీతాలు, బడ్జెట్ వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తాం. పాఠశాల నిర్మాణానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి. - ఎస్.వెంకటేశ్వరరావు, క్రీడా శాఖ ముఖ్య శిక్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!