logo

బ్రాహ్మణతర్లాలో చాకుతో దాడి

పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన ఇప్పిలి కృష్ణారావును అదే గ్రామానికి చెందిన వి.సంతోష్‌ హత్యచేసేందుకు యత్నించినట్లు సీఐ శంకరరావు ఆదివారం పేర్కొన్నారు. సంతోష్‌ మద్యం

Published : 24 Jan 2022 03:27 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన ఇప్పిలి కృష్ణారావును అదే గ్రామానికి చెందిన వి.సంతోష్‌ హత్యచేసేందుకు యత్నించినట్లు సీఐ శంకరరావు ఆదివారం పేర్కొన్నారు. సంతోష్‌ మద్యం తాగి వీధిలో శనివారం రాత్రి వీరంగం చేస్తుండగా కృష్ణారావు అడిగారని, దీంతో ఇద్దరి మధ్యం వాగ్వాదం జరిగిందన్నారు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారని, అర్ధరాత్రి సమయంలో కృష్ణారావు మూత్ర విసర్జనకు వీధిలోకి రాగా సంతోష్‌ వెనుక నుంచి వచ్చి చాకుతో రెండు సార్లు  పొడిచినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామని   సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని