logo

భర్త కళ్లెదుటే దుర్మరణం

భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్తున్నారు. ఇంతలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం పాలైంది. కళ్లముందే భార్య కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో భర్త రహదారిపైనే

Published : 24 Jan 2022 03:27 IST

సునీత మృతదేహం వద్ద రోదిస్తున్న సత్యనారాయణ

పొందూరు, న్యూస్‌టుడే: భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్తున్నారు. ఇంతలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం పాలైంది. కళ్లముందే భార్య కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో భర్త రహదారిపైనే గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన పొందూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాం మండలం రాజయ్యపేట గ్రామానికి చెందిన భార్యాభర్తలు కోరాడ సత్యనారాయణ, సునీత(35) ఆదివారం ద్విచక్ర వాహనంపై సింగుపురం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి బయల్దేరారు. మండలంలోని నందివాడ గ్రామ సమీపంలో ఆప్కో కంపెనీ వద్ద రహదారిపై ఉన్న వేగనియంత్రికలను దాటుతుండగా వెనుక ఉన్న ఆమె ఒక్కసారిగా ఎగిరి పడిపోవడంతో తల రోడ్డుకి తగిలి బలమైన గాయమైంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. అప్పటివరకు తనతో మాట్లాడిన అర్ధాంగి ఇక లేదనే విషయం జీర్ణించుకోలేక సత్యానారాయణ అక్కడే బోరున విలపించారు. ఆ దృశ్యాలు స్థానికులకు కంటతడి పెట్టించాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతితో స్వగ్రామం రాజయ్యపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని