వేర్వేరుగా ఇద్దరు బలవన్మరణం
అనారోగ్యం కారణంతో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదగిరిగుట్ట పట్టణ శివారులో విద్యుత్తు తీగలు పట్టుకొని మహేంద్ర కుమార్
మృతుడు ఎలగందుల మహేష్
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్టుడే: అనారోగ్యం కారణంతో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదగిరిగుట్ట పట్టణ శివారులో విద్యుత్తు తీగలు పట్టుకొని మహేంద్ర కుమార్ ప్రాణాలు తీసుకోగా.. గుండాల మండలంలో యువకుడు ఎలగందుల మహేష్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి దేవస్థాన అభివృద్ధి పనులు చేయడానికి రాజస్థాన్లోని గోత్ర భూక్రాన్ గ్రామం నుంచి మహేంద్ర కుమార్ (38), అతని అన్నకుమారుడు మనోజ్కుమార్, మరికొందరు కూలీలతో కలిసి ఈ నెల 28న యాదగిరిగుట్టకు వచ్చారు. పట్టణ శివారులోని మల్లాపురం రహదారి పక్కన శిబిరం ఏర్పాటుచేసుకొని సహచరులతో కలిసి యాదాద్రి కొండపైకి పనులు వెళ్లేవారు. వైద్యం చేయించుకున్నా.. ఆరోగ్యం కుదుట పడకపోవడంతోపాటు అటు కుటుంబానికి దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కనిపించకుండా పోయారు.. ఆ శిబిరానికి కొంత దూరంలో ఉన్న విద్యుత్తు నియంత్రిక కింద మహేంద్రకుమార్ విగతజీవిగా కనిపించడంతో పశువుల కాపరి ఆవుల కృష్ణ గమనించి, అతని సహచర కూలీలకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్తు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యుత్తు నియంత్రిక గద్దె ఎక్కి కరెంటు తీగలు పట్టుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతుని అన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.
రామారంలో... గుండాల: మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎలగందుల మహేష్(26) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యారు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద ఎవరూ లేని సమయంలో మహేష్ పురుగు మందు తాగారు. బావి దగ్గరికి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో అక్కడికి వెళ్లిన తండ్రి మల్లయ్య.. మంచంపై విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
తిప్పర్తి, న్యూస్టుడే: అనిశెట్టిదుప్పలపల్లి గ్రామం వద్ద అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్రీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ(45) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అనిశెట్టిదుప్పలపల్లి గ్రామంలో గత వారం రోజులుగా గుర్తుతెలియని మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతంలో నివసిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మిర్యాలగూడెం వైపు వెళ్లే రహదారిపై నడుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు గ్రామంలో భిక్షాటన చేసే సమయంలో కన్నడ భాషలో మాట్లాడుతుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. శవపరీక్ష అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి శవగారంలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. బంధువులు, తెలిసిన వారు ఎవరైనా గుర్తుపడితే తిప్పర్తి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సత్యనారాయణ కోరారు.
ధర్మోజిగూడెం స్టేజీ వద్ధ..
చౌటుప్పల్ గ్రామీణం: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ధర్మోజిగూడెం స్టేజీ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన రూపాని రాములు(43) హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ధర్మోజిగూడెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి దాటుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును మెరుగైన చికిత్స నిమిత్తం నల్గొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములు మృతి చెందినట్లు తెలిపారు.
నీటికుంటలో పడి మహిళ మృతి
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీ ప్రాతంలో ఉన్న నీటి కుంటలో పడి మహిళ మృతి చెందినట్లు రూరల్ ఎస్సై గోపాల్రావు తెలిపారు. మాన్యం చల్కకు చెందిన మాతంగి అఖిల(30) కొద్ది రోజులుగా మతిస్థితిమితం సరిగా లేక తల్లిగారి ఇల్లు అయిన కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో ఉంటుంది. తల్లితో కలిసి నల్గొండకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో అఖిల తప్పిపోయింది. మార్గమధ్యలో ఉన్న కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. రోడ్డు వెంట వెళ్తున్న వారు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించి మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ