రోజుల వ్యవధిలో తండ్రీ, కుమారుడు మృతి
విధి ఆడిన నాటకంలో ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో తండ్రీ, కుమారుడు వివిధ కారణాలతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. శావల్యాపురం మండలం బొందిలిపాలేనికి చెందిన రసపుత్ర బాలయ్యది పేద
కుదేలైన కుటుంబం
బాలయ్య సింగ్, భాను సింగ్ (పాత చిత్రాలు)
బొందిలిపాలెం (శావల్యాపురం), న్యూస్టుడే : విధి ఆడిన నాటకంలో ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో తండ్రీ, కుమారుడు వివిధ కారణాలతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. శావల్యాపురం మండలం బొందిలిపాలేనికి చెందిన రసపుత్ర బాలయ్యది పేద కుటుంబం. కుమారుడు రసపుత్ర భానుసింగ్ లారీ డ్రైవరు. బాలయ్య గ్రామంలో నాలుగు చక్రాల బండిపై కూరగాయలు విక్రయించేవాడు. గత నెల 13న తెలంగాణ రాష్ట్రంలోని హసీనాబాద్ వద్ద భానుసింగ్ లారీని రోడ్డుపక్కన నిలిపి టీ తాగడానికి వెళ్లాడు. టీ తాగి లారీ ఎక్కడానికి వస్తుండగా వెనుక వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్యతో పాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు చనిపోయి నెల గడవక ముందే ఆదివారం తెల్లవారుజామున బాలయ్య గుండెపోటుతో మరణించాడు. కుటుంబానికి జీవనాధారమైన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో తమకు దిక్కు ఎవరంటూ బాలయ్య భార్య విలపించడం స్థానికులను కలిచి వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల