చికిత్స పొందుతూ యువతి మృతి
ఈ నెల 2వ తేదీ గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఏలూరు నుంచి విజయవాడ వస్తున్న
చిన్నఅవుటపల్లి (గన్నవరం గ్రామీణం), న్యూస్టుడే : ఈ నెల 2వ తేదీ గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఏలూరు నుంచి విజయవాడ వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ బాటసారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సేవ చంద్రకాంత్(25), బాటసారి దారా వెంకటరత్నం(47) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న షేక్ షమీనా(22) తీవ్రంగా గాయడింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం మృతిచెందినట్లు ఆత్కూరు ఎస్సై కిశోర్ తెలిపారు. మృతురాలిది నెల్లూరు పరమేశ్వరీ నగర్గా గుర్తించారు. విజయవాడలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోందని, స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు జంగారెడ్డిగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్