కారు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు

మండలంలోని నెలివాడ కూడలి వద్ద కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో 8 మంది గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి వివరాల ప్రకారం పాచిపెంట మండలం కేసలి గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు విజయనగరంలోని కళాశాలకు ఆ

Updated : 02 Jul 2022 06:44 IST


ప్రమాదానికి గురైన విద్యార్థులు

బొండపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని నెలివాడ కూడలి వద్ద కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో 8 మంది గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి వివరాల ప్రకారం పాచిపెంట మండలం కేసలి గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు విజయనగరంలోని కళాశాలకు ఆటోలో వెళ్తున్నారు. నెలివాడ కూడలి వద్దకు వచ్చేసరికి, అదే మార్గంలో విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న కారు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో పాటు విద్యార్థులకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని