విదేశీ చదువు వణికిస్తోంది!
హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీ చైనా నుంచి ముడి ఔషధాలు దిగుమతి చేసుకుని, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్లు), తుది ఔషధాలు ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొవిడ్ పరిణామాల్లో రవాణా ఛార్జీలు, అన్ని రకాల ముడిపదార్థాల ధరలు పెరిగి ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా..
రూ.82 సమీపంలోకి డాలర్
దిగుమతులు, పర్యటనలూ పెనుభారం
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్లోని ఒక ఫార్మా కంపెనీ చైనా నుంచి ముడి ఔషధాలు దిగుమతి చేసుకుని, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్లు), తుది ఔషధాలు ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొవిడ్ పరిణామాల్లో రవాణా ఛార్జీలు, అన్ని రకాల ముడిపదార్థాల ధరలు పెరిగి ఇప్పటికే ఇబ్బంది పడుతుండగా.. రూపాయి మారకపు విలువ బాగా తగ్గడంతో ఈ సంస్థ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లైంది.
* వెంకట్రావు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. బీటెక్ పూర్తిచేసిన కూతురు అమెరికాలో ఎంఎస్ చేస్తానంటే, గత డిసెంబరులో పంపించారు. అప్పడు డాలర్ విలువ రూ.75- 76 వద్ద ఉంది. ఒక టర్మ్ ఫీజు చెల్లించారు. రెండో టెర్మ్ ఫీజు చెల్లించాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడేమో డాలర్ రూ.82కు సమీపిస్తోంది. ప్రతి డాలర్కు ఆరేడు రూపాయల వ్యత్యాసం వల్ల, ఫీజుగా చెల్లించాల్సిన మొత్తం రూ.1- 1.5 లక్షల మేర పెరిగినట్లయిందని వాపోతున్నారు.
* హైదరాబాద్లోని నలుగురు మిత్రులు అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీసాలు కూడా రావడంతో, విమాన టిక్కెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకుందామని అనుకున్నారు. అయితే రూపాయి విలువ పతనం కావడంతో, అంచనా వేసుకున్న ఖర్చు బాగా పెరుగుతున్నందున, పర్యటన వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు పతనమవుతోంది. అంటే ప్రతి డాలర్ రూపేణ చెల్లింపులకు రూ.7 మేర అదనంగా వెచ్చించాల్సిందే. కరెన్సీ విలువ 10 శాతం క్షీణించడంతో, దిగుమతులపై ఆధారపడిన వ్యాపార సంస్థలకు ఖర్చులు పెరిగి, లాభాలు హరించుకుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఫార్మా, మరికొన్ని ఇతర రంగాల పరిశ్రమలు ముడిపదార్థాలు, విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ సంస్థలన్నింటికీ ప్రస్తుత పరిస్థితులు కష్టాలు తెస్తున్నాయి. విదేశీ చదువులకు పిల్లలను పంపించిన తల్లితండ్రుల బాధలు వర్ణనాతీతం. కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు బ్యాంకు నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకుని పిల్లల్ని అమెరికా, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు పంపించడం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశతో దిగువ - మధ్యతరగతి, కుటుంబాల వారు ఎక్కువగా తమ పిల్లలను విదేశీ చదువులకు పంపుతున్నారు. ఇక్కడ రూపాయల్లో అప్పు తీసుకుని, అమెరికా యూనివర్సిటీలకు డాలర్లలో ఫీజు చెల్లించాలి. అమెరికాలో ఎంఎస్ చేయాలంటే 50,000 - 60,000 డాలర్ల వరకు అవుతోంది. ఏడాది వ్యవధిలో డాలర్ విలువ రూ.7 పెరగడం వల్ల, ఒక్కో విద్యార్థి కుటుంబంపై రూ.4- 5 లక్షల అదనపు భారం పడుతోంది. కొత్తగా వెళ్దామని భావిస్తున్న విద్యార్థులు, ‘ఖర్చు మరీ అధికమవుతుంద’నే ఆందోళనతో తమ అడ్మిషన్లను వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ‘స్ప్రింగ్ (అక్టోబరు-నవంబరు) అడ్మిషన్కు వెళ్దామనుకున్నా.. కానీ ఇప్పుడు వాయిదా వేసుకొని వచ్చే ఫాల్ (ఫిబ్రవరి-మార్చి) సెమిస్టర్కు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా’ అని స్థానిక విద్యార్థి ఒకరు వివరించారు.
82.50 వరకూ పడిపోవచ్చు: డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అయిదారు నెలల్లో 82.50 వరకు పడిపోవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఉపాధ్యక్షుడు జతీన్ త్రివేది అంచనా వేశారు. ద్రవ్యోల్బణ ముప్పు తగ్గకపోవడం, అంతర్జాతీయంగా మాంద్యం భయాలు విస్తరించడాన్ని కారణాలుగా పేర్కొన్నారు. అమెరికా ఫెడ్ రేటు 3-3.25% దగ్గర ఉంది. కొత్త ఏడాదికి ఇది 4- 4.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ఆమేరకు అమెరికా బాండ్లపై ప్రతిఫలం ఎక్కువ వస్తుంది. దీనివల్ల మనదేశంతో పాటు ఇతర వర్థమాన దేశాల నుంచి డాలర్ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రూపాయి విలువపై ఒత్తిడి కొంతకాలం కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM