ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని చాలు
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉంటే సరిపోతాయని.. అవి కూడా బలమైనవే అయి ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అందువల్ల చిన్న బ్యాంకులను
అవీ బలంగా ఉండాలి
ఎస్బీఐ మాజీ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య
దిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉంటే సరిపోతాయని.. అవి కూడా బలమైనవే అయి ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అందువల్ల చిన్న బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదా విలీనం చేయాలని ఆమె అన్నారు. పీఎస్బీలకు సమాన అనుకూల పరిస్థితులను కల్పిస్తే అవి రాణిస్తాయన్నారు. పీఎస్బీల ప్రైవేటీకరణ వల్ల ఏ లక్ష్యాలైతే సాధించాలనుకున్నారో, అప్పుడు ప్రభుత్వ రంగంలోనూ సాధించవచ్చని ఆమె తెలిపారు. సమస్యలన్నింటికీ ప్రైవేటీకరణ ఒక్కటే ఎప్పుడూ సమాధానం కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పీఎస్బీలు అన్నింటినీ ప్రైవేటీకరించేందుకు 10 ఏళ్ల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు రావాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు చేసిన సూచనపై స్పందిస్తూ భట్టాచార్య పైవ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఉండాలని నేను అనుకోవడం లేదు. ఆ సంఖ్యను తగ్గించాలి. కొన్నింటిని ప్రైవేటీకరించాలి. బలమైన బ్యాంకులను ప్రభుత్వ రంగంలోనే కొనసాగనివ్వాల’ని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం సేల్స్ఫోర్స్ ఇండియాకు సీఈఓ, ఛైర్పర్సన్గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2020లో 10 జాతీయ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుఆ ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పీఎస్బీల మొత్తం సంఖ్యను 12కు తగ్గించింది. మరో రెండు పీఎస్బీలను ప్రైవేటీకరించే ఉద్దేశంలో ఉన్నట్లు 2021-22 బడ్జెట్లోనూ వెల్లడించింది. పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్న నీతిఆయోగ్ ప్రతిపాదనపై భట్టాచార్య స్పందిస్తూ.. 17 - 25 ఏళ్ల వారికే అవి ఉపయోగకరమని అన్నారు. వినియోగదార్లు ఉంటే.. ఏదోక సమయంలో ఈ డిజిటల్ బ్యాంకులూ తమ పాత్ర పోషించగలుగుతాయని అన్నారు. డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రక్రియ అని అంటూనే.. మార్పు అనివార్యం అని ఆమె వివరించారు. ‘మార్పును ఆపేందుకు ప్రయత్నించొచ్చు. లేదంటే ఆలస్యం చేసేందుకు చూడొచ్చు. కానీ మొత్తం మీద ఆపలేమ’ని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ఈ ఏడాదిలో తీసుకొస్తే.. అదో కీలక పరిణామం అవుతుందని భట్టాచార్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ