
ప్రధానాంశాలు
బస్సులో ప్రాణాలొదిలిన వృద్ధుడు..
భార్య సహా దించేసిన సిబ్బంది
బొబ్బిలి, న్యూస్టుడే: మానవత్వం మంటగలిసింది. ఆర్టీసీ బస్సులో ప్రాణాలు విడిచిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను బస్సు సిబ్బంది మార్గమధ్యంలోనే దించేశారు. ఈ విషాదం విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (62), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. పైడయ్య కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో భార్యాభర్తలు పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయారు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోలుబంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- అమెరికా అప్పెంతో తెలుసా?
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి